కాంగ్రెస్ ఆఫర్‌ను తిరస్కరించిన ప్రశాంత్ కిశోర్

ABN , First Publish Date - 2020-06-03T20:08:42+05:30 IST

మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పక్షాన ప్రచారం నిర్వస్తున్నట్లు వస్తున్న పుకార్లను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్

కాంగ్రెస్ ఆఫర్‌ను తిరస్కరించిన ప్రశాంత్ కిశోర్

పాట్నా : మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పక్షాన ప్రచారం నిర్వస్తున్నట్లు వస్తున్న పుకార్లను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బుధవారం ఖండించారు. అలాంటి వార్తల్లో నిజం లేదని, తాను కాంగ్రెస్ పక్షాన ప్రచారం నిర్వహించడం లేదని తేల్చి చెప్పారు. కమల్‌నాథ్ సర్కారుకు 24 మంది ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చి, జ్యోతిరాదిత్య సింథియా వెంట నడవడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి.


ఈ సమయంలోనే కాంగ్రెస్ పక్షాన పీకే ప్రచారం నిర్వహించనున్నారని పుకార్లు వచ్చాయి. ‘‘ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలంటూ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇద్దరూ నన్ను కోరారు. కానీ... అందుకు నేను తిరస్కరించా. ప్రాంతాల వారీగా, జోన్ల వారీగా కాంగ్రెస్‌కు మద్దతివ్వను’’ అని ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పారు. 

Updated Date - 2020-06-03T20:08:42+05:30 IST