ప్రధాని కోసం ప్రత్యేక సొరంగమార్గం

ABN , First Publish Date - 2020-02-05T22:26:06+05:30 IST

పార్లమెంటుకు ప్రధాని వెళ్లడం కోసం ప్రత్యేకంగా టన్నెల్ మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ‘సెంట్రల్ విస్తా’ ప్రాజెక్టులో భాగంగా చేస్తున్నట్లు

ప్రధాని కోసం ప్రత్యేక సొరంగమార్గం

పార్లమెంటుకు ప్రధాని వెళ్లడం కోసం ప్రత్యేకంగా టన్నెల్ మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ‘సెంట్రల్ విస్తా’ ప్రాజెక్టులో భాగంగా చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ వెల్లడించారు. ఇలాంటి వీఐపీలు ఎక్కడికైనా వెళ్లేప్పుడు, సామాన్యులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటారని బిమల్ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడంలో భాగంగానే అధిక సెక్యూరిటీ అవసరమైన ప్రధాని వంటి వ్యక్తులను సాధారణ ట్రాఫిక్ నుంచి వేరుచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకూ ఓ టన్నెల్ రోడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసాన్ని కూడా సౌత్ బ్లాక్‌కు మారుస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-02-05T22:26:06+05:30 IST