173 మంది కార్మికుల కోసం ప్రత్యేక విమానం!
ABN , First Publish Date - 2020-06-06T07:58:31+05:30 IST
ఇప్పటికే కరోనా, నిసర్గ విపత్తుల్లో నిరుపేదలకు అం డగా నిలిచి దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని కొల్లగొట్టిన సోనూ
- కొనసాగుతున్న సోనూ సూద్ దాతృత్వం
ముంబై, జూన్ 5: ఇప్పటికే కరోనా, నిసర్గ విపత్తుల్లో నిరుపేదలకు అం డగా నిలిచి దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని కొల్లగొట్టిన సోనూ సూద్, మరోసారి తన సహృదయతను చాటుకున్నారు. ముంబై నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడున్కు వలస కార్మికులను పంపేందుకు ఎయిర్ఏషియా ఇండియాకు చెందిన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. 173మంది కార్మికుల్ని ఆ విమానం ద్వారా డెహ్రాడున్కు చేరేలా చూశారు.