ఓటు వేసే ముందు ఆలోచించండి: సోనూసూద్
ABN , First Publish Date - 2020-10-28T17:26:13+05:30 IST
బీహార్లో ఈరోజు తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా...
ముంబై: బీహార్లో ఈరోజు తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా సినీ నటుడు, సోషల్ యాక్టివిస్ట్ సోనూ సూద్ బీహార్ ఓటర్లకు తెలివిగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. బీహార్లోని ప్రజలు ఏ రోజైతే వలస వెళ్లకుండా తమ రాష్ట్రంలోనే ఉపాధి పొందుతారో ఆరోజే దేశానికి నిజమైన విజయమన్నారు. తన ట్వట్టర్ హ్యాండిల్లో సోనూసూద్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగా సోనూసూద్ కరోనా లాక్డౌన్ సమయంలో వలస కూలీలకు బాసటగా నిలిచారు. మహానగరాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి ప్రాంతాలకు తరలించేందుకు సహకారం అందించారు.