నితీశ్ సర్కార్ దారి తప్పిపోయింది : సోనియా ఫైర్

ABN , First Publish Date - 2020-10-27T19:47:34+05:30 IST

సీఎం నితీశ్ సర్కార్ పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం, అహంతో నితీశ్ ప్రభుత్వం నిర్దేశించుకున్న

నితీశ్ సర్కార్ దారి తప్పిపోయింది : సోనియా ఫైర్

న్యూఢిల్లీ : సీఎం నితీశ్ సర్కార్ పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం, అహంతో నితీశ్ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నుంచి పక్కకు తప్పిపోయిందని సోనియా గాంధీ విమర్శించారు. బిహార్ ప్రజలు మహాఘట్ బంధన్‌తోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘అధికారం, అహంతో నితీశ్ ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నుంచి పక్కకు తప్పిపోయింది. నితీశ్ పాలనలో కార్మికులు నిస్సహాయులయ్యారు. రైతుల పరిస్థితి బాగోలేదు. యువత తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు మహాఘట్ బంధన్ తో ఉన్నారు.’’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.


దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం సరిగ్గా లేదని, దాని ప్రభావం పేద ప్రజలపై తీవ్రంగా పడుతోందని, బిహార్ ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, మహా దళితుల పరిస్థితి రాష్ట్రంలో చాలా దయనీయంగా ఉందని, వారందరూ మహాఘట్ బంధన్‌తోనే ఉన్నారని ఆమె ప్రకటించారు. ఢిల్లీ, బిహార్ ప్రభుత్వాలు బంధనంలో ఉన్న ప్రభుత్వాలని, నోట్లరద్దు, లాకౌట్, నిరుద్యోగం లాంటి బంధనాల్లో ఆ ప్రభుత్వాలు కొట్టుమిట్టాడుతున్నాయని ఆమె విమర్శించారు. బిహార్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మార్పు కూడా దగ్గర్లోనే ఉందన్నారు. ప్రజల చేతిలో నైపుణ్యం విపరీతంగా ఉందని, అయితే... నిరుద్యోగిత, వలస కారణంగా వారి జీవితాల్లో మార్పు రావడం లేదని సోనియా పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-27T19:47:34+05:30 IST