గుజరాత్‌లో మళ్లీ కంపించిన భూమి

ABN , First Publish Date - 2020-06-16T08:39:01+05:30 IST

కచ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మళ్లీ భూమి కంపించింది. ఒకే రోజు 1.4 నుంచి 4.6 తీవ్రతతో 14సార్లు కంపనాలు వచ్చాయని అధికారులు చెప్పారు. బచౌకు ఉత్తర ఈశాన్యంలో 10కిలోమీటర్ల దూరంలో...

గుజరాత్‌లో మళ్లీ కంపించిన భూమి

అహ్మదాబాద్‌, జూన్‌ 15: కచ్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మళ్లీ భూమి కంపించింది. ఒకే రోజు 1.4 నుంచి 4.6 తీవ్రతతో 14సార్లు కంపనాలు వచ్చాయని అధికారులు చెప్పారు. బచౌకు ఉత్తర ఈశాన్యంలో 10కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని తెలిపారు. కాగా, ఆదివారం రాత్రి 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం విదితమే. 

Updated Date - 2020-06-16T08:39:01+05:30 IST