కేంద్రం నిధులిచ్చినా,రాష్ట్రం సహాయం చేయలేదు...

ABN , First Publish Date - 2020-10-31T16:11:19+05:30 IST

కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు....

కేంద్రం నిధులిచ్చినా,రాష్ట్రం సహాయం చేయలేదు...

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపణ

భువనేశ్వర్ (ఒడిశా): కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  కొవిడ్-19 మహమ్మారి సమయంలో కేంద్రం రాష్ట్రానికి నిధులు అందించినా ప్రజలకు సాయం అందించడంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.జగత్ సింగ్ పూర్ జిల్లాకు కేంద్రం రూ.8708 కోట్లు సమకూర్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా  సమయంలో ప్రజలకు  సాయం అందించలేదని మంత్రి ప్రధాన్ విమర్శించారు.కరోనాను కట్టడి చేయడంలో ఒడిశా విఫలమైందని మంత్రి ఆరోపించారు. బీజేడీ సర్కారు యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైందని దీంతో యువత ఇతర రాష్ట్రాలకు వలసవెళుతున్నారని ప్రధాన్ విమర్శించారు.దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులను రాష్ట్రప్రభుత్వం  ఆదుకోలేకపోవడంపై ఒడిశా రాష్ట్రప్రభుత్వంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు  గుప్పించారు.

Updated Date - 2020-10-31T16:11:19+05:30 IST