విచారణను అడ్డుకోడానికే సీబీఐ విచారణ కోరుతున్నారు : సింఘ్వీ
ABN , First Publish Date - 2020-07-19T18:05:49+05:30 IST
బీజేపీపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వి ఫైర్ అయ్యారు. రాజస్థాన్లోని ఆడియో

న్యూఢిల్లీ : బీజేపీపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వి ఫైర్ అయ్యారు. రాజస్థాన్లోని ఆడియో టేపుల వివాదంపై కేంద్ర హోం శాఖ సమగ్ర నివేదికను కోరడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గెహ్లోత్ నేతృత్వంలోని సర్కార్ను కూలదోయడానికి ప్రయత్నాలు చేశారని, ఈ కుట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రి కూడా ఉన్నట్లు విమర్శలున్నాయని పేర్కొన్నాయి.
దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోందని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ విచారణను ఎలాగైనా ఆపేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకే సీబీఐ విచారణను కోరుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ఇందులో జోక్యం చేసుకుందని, వారికి క్లీన్ చిట్ ఇవ్వడానికే బీజేపీ సీబీఐ విచారణను కోరుతోందని సింఘ్వి ఎద్దేవా చేశారు.