విమానయానం కంటే షాపింగే డేంజర్‌

ABN , First Publish Date - 2020-10-31T07:37:14+05:30 IST

విమానంలో ప్రయాణించే వారి కంటే.. నిత్యావసరాల కోసం షాపింగ్‌ చేసేవాళ్లు, హోటళ్లు,

విమానయానం కంటే షాపింగే డేంజర్‌

దానివల్లే ఇన్ఫెక్షన్‌ ముప్పు ఎక్కువ 

న్యూఢిల్లీ, అక్టోబరు 30 : విమానంలో ప్రయాణించే వారి కంటే.. నిత్యావసరాల కోసం షాపింగ్‌ చేసేవాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారపదార్థాలు తినేవారికి కరోనా ముప్పు ఎక్కువని అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రయాణికుల ఆరోగ్య ధ్రువీకరణ నుంచి మొదలుకొని ప్రతి విషయంలో విమానయాన సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

దీంతో ప్రయాణికులకు వైరస్‌ ముప్పు గణనీయంగా తగ్గింది. వారితో పోలిస్తే.. జనంతో కిక్కిరిసి ఉండే నిత్యావసరాల దుకాణాలు, హోటళ్లకు వెళ్లే వారికే ఇన్ఫెక్షన్‌ గండం ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు.


Updated Date - 2020-10-31T07:37:14+05:30 IST