దుబే ఎన్‌కౌంటర్‌: యూపీ పోలీసులకు శివసేన బాసట

ABN , First Publish Date - 2020-07-10T21:25:28+05:30 IST

గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు శివసేన బాసటగా నిలిచింది. ఒక కరడుగట్టిన..

దుబే ఎన్‌కౌంటర్‌: యూపీ పోలీసులకు శివసేన బాసట

ముంబై: గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌ విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు శివసేన బాసటగా నిలిచింది. ఒక కరడుగట్టిన నేరస్థుడిని పోలీసులు కాల్చించంపడాన్ని ప్రశ్నించాల్సిన పని లేదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు.


'వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎవరూ ప్రశ్నలు లేవనెత్తడం సరికాదు. ఎలా జరిగిందనే దానిపై ప్రశ్నలు సహజం. అయితే ఎనిమిది మంది పోలీసులను మట్టుబెట్టిన రాష్ట్రంలో  ఎన్‌కౌంటర్లపై ఎవరూ ప్రశ్నించరాదు. పైగా ఎన్‌కౌంటర్లు చోటుచేసుకోవడం ఇదే మొదటి సారి కూడా కాదు' అని సంజయ్ రౌత్ అన్నారు.


దీనికి ముందు కాన్పూర్‌ ఎన్‌కౌంటర్‌లో దుబే ముఠా సభ్యులుగా భావిస్తున్న వారు జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మరణించారు. అప్పట్నించి పరారీలో ఉన్న దుబే ఎట్టకేలకు గురువారం పట్టుబడి ఇవాళ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

Updated Date - 2020-07-10T21:25:28+05:30 IST