ఆమెకు పధ్నాలుగు మందితో ‘సంబంధం’... భర్త నిఘాతో బట్టబయలు
ABN , First Publish Date - 2020-08-21T01:17:20+05:30 IST
డబ్బుడబ్బు, నౌకర్లు, భర్త అందించే అమితమైన ప్రేమ... ఇవేవీ ఆమెకు తృప్తినివ్వలేదు. ఈ క్రమంలోనే... ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏక కాలంలో ఏకంగా పధ్నాలుగు మందితో ‘సంబంధం’ నడిపింది. అయితే... ఒక సందర్భంలో... భర్తకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో... విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి.

కోల్కత : డబ్బు, నౌకర్లు, భర్త అమితమైన ప్రేమ... ఇవేవీ ఆమెకు తృప్తినివ్వలేదు. ఈ క్రమంలోనే... ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా పధ్నాలుగు మందితో ‘సంబంధం’ నడిపింది. అయితే... ఒక సందర్భంలో... భర్తకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో... విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి.
కోల్కతాకు చెందిన ఓ వ్యాపారవేత్తకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి అతను భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నా... ఆమె మాత్రం సఖ్యతగా ఉండేది కాదు. ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతుండడం, బయటకు వెళ్లడం చేస్తుండేది. ఈ క్రమంలో... భర్తకు అనుమానం తలెత్తింది. వెంటనే... ఓ ప్రైవేటు డిటెక్టీవ్ను ఏర్పాటు చేసి నిఘా పెట్టాడు.
ఈ క్రమంలో... ఆమె కదలికలను పూర్తిగా అధ్యయనం చేసిన డిటెక్టీవ్... విస్తుపోయే నిజాలను భర్తకందించాడు. ఇక విషయమేమిటంటే... ఆయన భార్య... ఒకరికి తెలియకుండా మరొకరితో, అలా మొత్తం పధ్నాలుగు మంది బాయ్ఫ్రెండ్స్తో ‘సంబంధం’ నెరపుతోందని తేల్చాడు. ఆ విషయం తెలిసిన భర్త తట్టుకోలేక పోయాడు. తనను మోసం చేసిన భార్యతో పాటు ఆ యువకులకు కూడా బుద్ది చెప్పాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే... తన భార్య వివాహేతర సంబంధంతో తన పరువు పోయిందంటూ రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. అయితే... కేవలం భార్యకే కాకుండా ఆ పధ్నాలుగు మంది బాయ్ఫ్రెండ్స్కు కూడా నోటీసులు పంపాడు. తనకు పరువు నష్టం కింద... రూ. 100 కోట్లను చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో పేర్కొన్నారు.
దీంతో ఏం చేయాలో అర్ధంకాక ఆమె బాయ్ఫ్రెండ్స్ తలలు పట్టుకున్నారు. మొత్తంమీద కోల్కతాలో ఈ విషయం చర్చనీయాంశమైంది.