ఆమెకు పధ్నాలుగు మందితో ‘సంబంధం’... భర్త నిఘాతో బట్టబయలు

ABN , First Publish Date - 2020-08-21T01:17:20+05:30 IST

డబ్బుడబ్బు, నౌకర్లు, భర్త అందించే అమితమైన ప్రేమ... ఇవేవీ ఆమెకు తృప్తినివ్వలేదు. ఈ క్రమంలోనే... ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏక కాలంలో ఏకంగా పధ్నాలుగు మందితో ‘సంబంధం’ నడిపింది. అయితే... ఒక సందర్భంలో... భర్తకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో... విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి.

ఆమెకు పధ్నాలుగు మందితో ‘సంబంధం’... భర్త నిఘాతో బట్టబయలు

కోల్‌కత : డబ్బు, నౌకర్లు, భర్త అమితమైన ప్రేమ... ఇవేవీ ఆమెకు తృప్తినివ్వలేదు. ఈ క్రమంలోనే... ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా పధ్నాలుగు మందితో ‘సంబంధం’ నడిపింది. అయితే... ఒక సందర్భంలో... భర్తకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో... విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. 


కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారవేత్తకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి అతను భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నా... ఆమె మాత్రం సఖ్యతగా ఉండేది కాదు. ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతుండడం, బయటకు వెళ్లడం చేస్తుండేది. ఈ క్రమంలో... భర్తకు అనుమానం తలెత్తింది. వెంటనే... ఓ ప్రైవేటు డిటెక్టీవ్‌ను ఏర్పాటు చేసి నిఘా పెట్టాడు.


ఈ క్రమంలో... ఆమె కదలికలను పూర్తిగా అధ్యయనం చేసిన డిటెక్టీవ్... విస్తుపోయే నిజాలను భర్తకందించాడు. ఇక విషయమేమిటంటే... ఆయన భార్య... ఒకరికి తెలియకుండా మరొకరితో, అలా  మొత్తం పధ్నాలుగు మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో ‘సంబంధం’ నెరపుతోందని తేల్చాడు. ఆ విషయం తెలిసిన భర్త తట్టుకోలేక పోయాడు. తనను మోసం చేసిన భార్యతో పాటు ఆ యువకులకు కూడా బుద్ది చెప్పాలనుకున్నాడు.


ఈ క్రమంలోనే... తన భార్య వివాహేతర సంబంధంతో తన పరువు పోయిందంటూ రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. అయితే... కేవలం భార్యకే కాకుండా ఆ పధ్నాలుగు మంది బాయ్‌ఫ్రెండ్స్‌కు కూడా నోటీసులు పంపాడు. తనకు పరువు నష్టం కింద... రూ. 100 కోట్లను చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో పేర్కొన్నారు.


దీంతో ఏం చేయాలో అర్ధంకాక ఆమె బాయ్‌ఫ్రెండ్స్ తలలు పట్టుకున్నారు. మొత్తంమీద కోల్‌కతాలో ఈ విషయం చర్చనీయాంశమైంది. 

Updated Date - 2020-08-21T01:17:20+05:30 IST