ఆంధ్రప్రదేశ్ కరోనాతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో చేదువార్త
ABN , First Publish Date - 2020-05-24T20:34:20+05:30 IST
రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రంగా మండిపోనున్నాయి. భానుడి భగభగలతో అల్లాడుతున్న జనాలకు భారత వాతావరణ సంస్థ(ఐఎండి) మరో చేదువార్త చెప్పింది. ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కుమార్ వెల్లడించారు.

న్యూఢిల్లీ : రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రంగా మండిపోనున్నాయి. భానుడి భగభగలతో అల్లాడుతున్న జనాలకు భారత వాతావరణ సంస్థ(ఐఎండి) మరో చేదువార్త చెప్పింది. ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కుమార్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతం, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎండ వేడిమి మరింత పెరగనున్నట్లు ఆయన తెలిపారు. మరో ఐదు రోజుల పాటు సూర్య ప్రతాపం తప్పదని.;. 47 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.
అసలే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను భానుడు మరింత భయపెడుతుండటం గమనార్హం.