నేడు వీధి వ్యాపారులకు స్వానిధి రుణాలు
ABN , First Publish Date - 2020-10-27T06:57:41+05:30 IST
దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు మూడు లక్షల మంది వీధి వ్యాపారులకు పీఎం స్వానిధి స్కీమ్ కింద

న్యూఢిల్లీ, అక్టోబరు 26: దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు మూడు లక్షల మంది వీధి వ్యాపారులకు పీఎం స్వానిధి స్కీమ్ కింద ప్రధాని మోదీ రుణాలను పంపిణీ చేయనున్నారు. మంగళవారం వర్చువల్ విధానంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఒక్కో వీధి వ్యాపారికి పది వేల రూపాయల చొప్పున అందజేస్తారు.
కాగా, ఈ రుణాల కోసం దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 5,57,000 మంది వీధి వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు.