ఏడాది చివరికల్లా ‘కొవిషీల్డ్’: ‘సీరం’
ABN , First Publish Date - 2020-08-11T07:17:57+05:30 IST
కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరిలోగా సిద్ధమవుతుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎ్సఐఐ) సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. వ్యాక్సిన్ డోసు తుది ధరపై మరో రెండు నెలల్లో పూర్తి స్పష్టత వస్తుందని...

పుణె, ఆగస్టు 10 : కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరిలోగా సిద్ధమవుతుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎ్సఐఐ) సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. వ్యాక్సిన్ డోసు తుది ధరపై మరో రెండు నెలల్లో పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. కాగా, ఇటీవల బిల్, మిలిండా గేట్స్ ఫౌండేషన్తో కుదిరిన ఒప్పందంలో డోసు ధర రూ.250కి మించకూడదనే షరతుకు ఎస్ఐఐ అంగీకరించింది.