‘సెక్యూరిటీ’ వేతనాలు చెల్లించాలి: కిషన్ రెడ్డి
ABN , First Publish Date - 2020-04-08T09:46:05+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న సెక్యురిటీ గార్డులకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సెక్యూరిటీ ఏజెన్సీలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న సెక్యురిటీ గార్డులకు క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సెక్యూరిటీ ఏజెన్సీలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అపార్ట్మెంట్లు తదితర చోట్ల నిబంధనలను అమలు చేస్తూ.. కరోనాపై పోరాడుతున్నారని పేర్కొన్నారు.