ముంబై తాజ్ హోటల్స్‌కు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం..

ABN , First Publish Date - 2020-07-01T05:28:58+05:30 IST

26/11 తరహా దాడులు చేస్తామంటూ ఉగ్రసంస్థ లష్కరే తొయిబా పేరుతో బెదిరింపు ఫోన్

ముంబై తాజ్ హోటల్స్‌కు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం..

ముంబై: 26/11 తరహా దాడులు చేస్తామంటూ ఉగ్రసంస్థ లష్కరే తొయిబా పేరుతో బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్, తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటళ్ల వద్ద అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. కొవిడ్-19 కారణంగా ప్రస్తుతం మూతపడిన ఈ రెండు హోటళ్లలో కొద్దిపాటి ఎంపిక చేసిన సేవలు మాత్రమే అందిస్తున్నారు. సోమవారం రాత్రి ఈ రెండు హోటళ్లకు విడివిడిగా పాకిస్తానీ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ‘‘బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి తాను కరాచీ నుంచి మాట్లాడుతున్నాననీ.. లష్కరే తొయిబాకి చెందిన వాడినని చెప్పుకున్నాడు. అయితే ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నాం..’’ అని పోలీసులు పేర్కొన్నారు. 





Updated Date - 2020-07-01T05:28:58+05:30 IST