వలస కార్మికుల పిల్లల చదువు ఆగొద్దు

ABN , First Publish Date - 2020-07-15T07:02:46+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వలస కార్మికుల పిల్లల చదువు కొనసాగింపు విషయంలో కేంద్రం కీలకమైన ఆదేశాలిచ్చింది. స్వగ్రామాల్లోని వారి పరిసర పాఠశాలల్లో ప్రవేశానికి తప్పనిసరి రుజువులు మినహా ఇతరత్రా పత్రాలు కోరవద్దని...

వలస కార్మికుల పిల్లల చదువు ఆగొద్దు

  • టీసీ, గత తరగతుల రుజువు అడగొద్దు: కేంద్రం


న్యూఢిల్లీ, జూలై 14: లాక్‌డౌన్‌ వల్ల స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వలస కార్మికుల పిల్లల చదువు కొనసాగింపు విషయంలో కేంద్రం కీలకమైన ఆదేశాలిచ్చింది. స్వగ్రామాల్లోని వారి పరిసర పాఠశాలల్లో ప్రవేశానికి తప్పనిసరి రుజువులు మినహా ఇతరత్రా పత్రాలు కోరవద్దని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. టీసీ, గతంలో చదివిన తరగతుల రుజువులు వంటివి అడగకుండా.. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం సరైనదేనని భావించి సంబంధిత తరగతిలో చేర్చుకోవాలని నిర్దేశించింది. 


Updated Date - 2020-07-15T07:02:46+05:30 IST