స్ట్రెయిన్ ఎఫెక్ట్: జనవరి 15 వరకు ముంబైలో స్కూళ్లు బంద్!
ABN , First Publish Date - 2020-12-30T05:20:15+05:30 IST
స్ట్రెయిన్ ఎఫెక్ట్: జనవరి 15 వరకు ముంబైలో స్కూళ్లు బంద్!
ముంబై: జనవరి 15 వరకు ముంబైలోని పాఠశాలలన్నీ మూసివేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్కి సంబంధించి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ సర్కులర్ విడుదల చేశారు. కాగా ఇంతకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ఈ నెల 22న నిర్ణయం తీసుకున్నారు. అయితే అత్యవసర సేవల సిబ్బంది, వ్యాపారులు, వివిధ అవసరాల కోసం ప్రయాణించేవారికి పరిస్థితిని బట్టి మినహాయింపు ఇస్తారు.