స్కామ్ల్లో ఇరుక్కున్నవారే పేదలపై నిందలు మోపారు: మోదీ
ABN , First Publish Date - 2020-10-28T07:04:44+05:30 IST
వీధివ్యాపారుల నిజాయితీని, కష్టపడేతత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే గతంలో వారికి అందని రుణాలను ఇప్పుడు తమ సర్కార్ అందిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు...

లఖ్నవూ/న్యూఢిల్లీ, అక్టోబరు 27 : వీధివ్యాపారుల నిజాయితీని, కష్టపడేతత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించిందని, అందుకే గతంలో వారికి అందని రుణాలను ఇప్పుడు తమ సర్కార్ అందిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘పేదల పేరుతో రాజకీయం చేస్తున్నవారు..వారికి రుణాలు ఇస్తే మళ్లీ చెల్లించరనే వాతావరణాన్ని సృష్టించారు. కుంభకోణాల్లో ఇరుక్కున్న పెద్దలు వారి నిజాయితీలేని పనులకు నిందను మాత్రం పేదలపై మోపేవారు’’ అని ప్రధాని వివరించారు. ప్రధాని వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వానిధి) పథకం కింద ఎంపికైన ఉత్తరప్రదేశ్కు చెందిన లబ్ధిదారులను ఉద్దేశించి మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.