సీవీసీగా ప్రమాణం చేసిన సంజయ్ కొఠారి
ABN , First Publish Date - 2020-04-25T17:38:10+05:30 IST
చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొఠారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో

న్యూఢిల్లీ: చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొఠారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ.. అందరూ మాస్కులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన్ను సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా కేంద్రం నియమించింది. సంజయ్ కొఠారి గతంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్టు చైర్మన్గా పనిచేశారు. హర్యానా క్యాడర్కు చెందిన సంజయ్.. 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సీవీసీగా ఆయన్ను నియమిస్తూ ఫిబ్రవరి 29న కేంద్రం నిర్ణయం తీసుకుంది.