రష్యా, అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారత్

ABN , First Publish Date - 2020-06-24T05:18:44+05:30 IST

న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ఓ పక్క చర్చలు జరుపుతూనే మరో పక్క రష్యా, అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసేందుకు భారత్ పావులు కదుపుతోంది.

రష్యా, అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారత్

న్యూఢిల్లీ: చైనాతో ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ఓ పక్క చర్చలు జరుపుతూనే మరో పక్క రష్యా, అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసేందుకు భారత్ పావులు కదుపుతోంది. రష్యా నుంచి ఎస్-400 మిసైల్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి గత ఏడాదే భారత్ రష్యాకు 40 వేల కోట్లు చెల్లించింది. వీటిని తక్షణమే అందజేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రష్యాను కోరనున్నారు. ప్రస్తుతం ఆయన రష్యా పర్యటనలో ఉన్నారు.


ఎస్-400 ట్రయంప్ లాంగ్ రేంజ్ మిసైల్ 400 కిలోమీటర్ల వరకూ లక్ష్యాలను చేధించగలదు. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణుల్లో ఒకటైన ఎస్-400 భారత రక్షణ వ్యవస్థలో చేరితే చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టవచ్చు. గతంలో ఎస్-400 కొనుగోలు చేసేందుకు రష్యాకు అడ్వాన్స్ ఇచ్చే సమయంలో అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం చైనాతో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అమెరికా మౌనంగానే ఉంది.


అదే సమయంలో అమెరికా నుంచి ఎం-777 హోవిట్జర్ శతఘ్నులను కూడా భారత్ కొనుగోలు చేయనుంది. 777 హోవిట్జర్ శతఘ్నులను హెలికాఫ్టర్లలో కూడా తరలించవచ్చు. ముఖ్యంగా గల్వాన్ లోయలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈ 777 హోవిట్జర్ శతఘ్నులు తమ సామర్థ్యాన్ని చాటతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా నుంచి భారత్ సి- 17 హెలికాఫ్టర్లు కూడా కొనుగోలు చేస్తోంది. 

Updated Date - 2020-06-24T05:18:44+05:30 IST