పార్లమెంట్ ఆవరణలో రుద్రాక్ష మొక్కను నాటిన వెంకయ్య
ABN , First Publish Date - 2020-08-13T23:16:48+05:30 IST
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకయ్యనాయుడు పార్లమెంటు ఆవరణలో ‘రుద్రాక్ష’ మొక్కను నాటారు. ‘రుద్రాక్ష’ మొక్కను నాటడం ఆనందాన్నిచ్చిందన్నారు.
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్గా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకయ్యనాయుడు పార్లమెంటు ఆవరణలో ‘రుద్రాక్ష’ మొక్కను నాటారు. ‘రుద్రాక్ష’ మొక్కను నాటడం ఆనందాన్నిచ్చిందన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, వన మహోత్సవాలను ‘జనమహోత్సవాలు’ గా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ ట్వీట్ చేశారు.