ఆరెస్సెస్ ప్రతినిధి సభ సమావేశాలు రద్దు
ABN , First Publish Date - 2020-03-15T07:42:06+05:30 IST
దేశంలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో.. బెంగళూరులో ఆదివారం నుంచి జరగాల్సిన ఆరెస్సెస్ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు రద్దయ్యాయి.
బెంగళూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో.. బెంగళూరులో ఆదివారం నుంచి జరగాల్సిన ఆరెస్సెస్ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు రద్దయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు ఈ సమావేశాలను రద్దు చేసినట్లు అఖిల భారత సహ ప్రచారక్ నరేంద్ర ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు.