సచివాలయ నిర్మాణంపై సుప్రీంలో రేవంత్ పిటిషన్
ABN , First Publish Date - 2020-09-16T07:31:25+05:30 IST
కొత్త సచివాలయం నిర్మాణంలో జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలను పరిశీలించాలని జాతీయ హరిత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కొత్త సచివాలయం నిర్మాణంలో జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలను పరిశీలించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కి సూచించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పర్యావరణ అనుమతులు లేకుం డా కూల్చివేస్తున్నట్లు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను కూడా రేవంత్రెడ్డి సవాలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టాలని కోరారు.