కరోనాతో ప్రఖ్యాత జ్యోతిష్కుడు బేజాన్ మృతి.. సీఎం సంతాపం

ABN , First Publish Date - 2020-05-30T03:00:09+05:30 IST

దేశంలో కరోనా భూతం విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.

కరోనాతో ప్రఖ్యాత జ్యోతిష్కుడు బేజాన్ మృతి.. సీఎం సంతాపం

అహ్మదాబాద్: దేశంలో కరోనా భూతం విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రఖ్యాత జ్యోతిష్కుడు బేజాన్ దారువాలా కరోనాకు బలయ్యారు. గుజరాత్‌కు చెందిన ఆయన కరోనా కారణంగా మరణించినట్లు అహ్మదాబాద్ ఆస్పత్రి శుక్రవారం వెల్లడించింది. బేజాన్ మృతికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంతాపం తెలిపారు. బేజాన్ మృతి చాలా బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ కోరుకున్నారు. కాగా, అమెరికాకు చెందిన హార్పర్‌కాలిన్స్ అనే సంస్థ ముద్రించిన ‘ది మిలీనియమ్ బుక్ ఆఫ్ ప్రొఫెసీ’ అనే పుస్తకంలో.. బేజాన్‌ దారువాలాను గత వెయ్యేళ్లలో పుట్టిన 100 మంది గొప్ప జ్యోతిష్కులలో ఒకరిగా పేర్కొంది.

Updated Date - 2020-05-30T03:00:09+05:30 IST