రోడ్లపై చర్చలు కుదరవ్... కూర్చోని మాట్లాడుకుందాం : తోమర్
ABN , First Publish Date - 2020-12-01T17:45:03+05:30 IST
రైతులతో చర్చించడానికి కేంద్ర సిద్ధంగానే ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. అయితే ఈ చర్చలు

న్యూఢిల్లీ : రైతులతో చర్చించడానికి కేంద్ర సిద్ధంగానే ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. అయితే ఈ చర్చలు రోడ్లపై కుదరవని ఆయన స్పష్టం చేశారు. రోడ్లపై కాకుండా, కూర్చోని మాట్లాడడానికి కేంద్రం సిద్ధంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేతకంగా పంజాబ్ సహా పలు రాష్ట్రాల రైతు సంఘాలు చేపట్టిన 'ఢిల్లీ ఛలో' నిరసన మార్చ్ కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన మంగళవారం ఆరవ రోజుకు చేరింది. కేంద్రం విజ్ఞప్తికి చలించకుండా రైతులు తమ డిమాండ్లు వినేంతవరకూ ఆందోళన కొనసాగించేందుకు పట్టుదలగా ఉన్నారు. దీంతో చర్చల విషయంలో ప్రతిష్టంభన తలెత్తింది. అయితే, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు ఈనెల 3వ తేదీన సమావేశం తేదీని మంత్రి ఖరారు చేశారు.