తొలిసారిగా 500 బిలియన్ డాలర్లు దాటిన విదేశీ మారక ద్రవ్యం
ABN , First Publish Date - 2020-06-13T00:52:38+05:30 IST
దేశానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్యం మొదటిసారిగా 500 బిలియన్ డాలర్లు(రూ.37 లక్షల కోట్లు) దాటింది. ఈ విషయాన్ని...
న్యూఢిల్లీ: దేశానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్యం మొదటిసారిగా 500 బిలియన్ డాలర్లు(రూ.37 లక్షల కోట్లు) దాటింది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఉండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంది. ఈ వారంలో దాదాపు 8.2 బిలియన్ డాలర్లు(రూ.6వేల కోట్లకు పైగా) నిల్వ పెరిగిందని, దీంతో జూన్ 5 నాటికి భారత విదేశీ మారక ద్రవ్యం 501.7 బిలియన్ డాలర్లకు(రూ.38 లక్షల కోట్లకు పైగా) చేరిందని తెలిపింది. మొత్తం విదేశీ మారక ద్రవ్యంలో విదేశీ కరెన్సీ నిల్వలు 463 బిలియన్ డాలర్లు(రూ.35 లక్షల కోట్లకు పైగా ) ఉండగా, బంగారం నిల్వలు 32.35 బిలియన్ డాలర్లు(రూ.24 వేల కోట్లకు)గా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.