పైనాపిల్ బాంబుతో ఏనుగును చంపడంపై రతన్ టాటా సంచలన ట్వీట్...
ABN , First Publish Date - 2020-06-04T18:09:02+05:30 IST
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పటాసులు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనపై ప్రముఖ పారిశ్రామిక ..
న్యూఢిల్లీ: కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుకు పటాసులు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మలప్పురంలో జరిగిన ఈ ఘోరంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో రతన్ టాటా ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించారు. జంతువులపై జరుగుతున్న ఇటువంటి దారుణాలను మానవ హత్యలుగానే పరిగణించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి...’’ అని టాటా తన పోస్టులో డిమాండ్ చేశారు.