‘ధ్రువ’ దేశాల్లో శరవేగంగా కరోనా వ్యాప్తి
ABN , First Publish Date - 2020-03-23T07:07:17+05:30 IST
ధ్రువాలకు దగ్గరగా ఉండే దేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సె్స(ఐఎంఎస్సీ) శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్లో..
![‘ధ్రువ’ దేశాల్లో శరవేగంగా కరోనా వ్యాప్తి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- పరిస్థితి చేయిదాటితే బుధవారంకల్లా
- భారత్లో కేసులు 900కు : ఐఎంఎస్సీ
చెన్నై, మార్చి 22: ధ్రువాలకు దగ్గరగా ఉండే దేశాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సె్స(ఐఎంఎస్సీ) శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్లో ఒక కరోనా బాధితుడి నుంచి సగటున 1.7 మందికి వ్యాధి సోకుతుండగా.. ఉత్తర ధ్రువ దేశమైన డెన్మార్క్లో 3.35 మందికి సోకుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్లో పరిస్థితి చేయిదాటితే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారానికి 900కు చేరొచ్చన్నారు.