రాళ్లతోనే రామాలయం నిర్మాణం...సూపర్వైజర్ వెల్లడి
ABN , First Publish Date - 2020-07-27T13:44:16+05:30 IST
అయోధ్యలో రామాలయం నిర్మాణం రాళ్లతోనే చేస్తామని ఆలయ నిర్మాణ వర్కు షాప్ సూపర్ వైజర్ అనూభాయ్ సోంపూర వెల్లడించారు....

అయోధ్య (ఉత్తరప్రదేశ్): అయోధ్యలో రామాలయం నిర్మాణం రాళ్లతోనే చేస్తామని ఆలయ నిర్మాణ వర్కు షాప్ సూపర్ వైజర్ అనూభాయ్ సోంపూర వెల్లడించారు. రామాలయం నిర్మాణంలో ఇనుము, ఉక్కు వినియోగించమని ఆయన స్పష్టం చేశారు. తాను 30 ఏళ్లుగా అయోధ్యలోని ఆలయ నిర్మాణ వర్కు షాప్ సూపర్ వైజరుగా పనిచేస్తున్నానని అనూభాయ్ చెప్పారు. ఇప్పటికే కొన్నిరాళ్లు నిర్మాణ స్థలంలో ఉన్నాయని, మరిన్ని రాళ్లు రాజస్థాన్ నుంచి తెప్పిస్తామని ఆయన చెప్పారు. సాధారణ రాళ్లు తెప్పించి ఇక్కడ ఉన్న రెండు యంత్రాల సాయంతో కట్ చేస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణానికి చెక్కలు, రాగి, తెల్ల సిమెంటు వినియోగిస్తామని అనూభాయ్ చెప్పారు. ఆలయంతో పాటు హనుమాన్ గర్హి మందిరాన్ని కూడా రాళ్లతోనే నిర్మిస్తామని మహంత్ రాజుదాస్ చెప్పారు.