మూడు సంస్కృత డీమ్డ్ వర్సిటీలకు సెంట్రల్ స్టేటస్

ABN , First Publish Date - 2020-03-17T02:12:41+05:30 IST

సంస్కృత భాషా అభిమానులకు శుభవార్త. కొద్ది సవరణలతో మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్శిటీలను సెంట్రల్

మూడు సంస్కృత డీమ్డ్ వర్సిటీలకు సెంట్రల్ స్టేటస్

న్యూఢిల్లీ : సంస్కృత భాషా అభిమానులకు శుభవార్త. కొద్ది సవరణలతో మూడు డీమ్డ్ సంస్కృత యూనివర్శిటీలను సెంట్రల్ యూనివర్శిటీలుగా మార్చాలనే తీర్మానాన్ని రాజ్యసభ సోమవారం ఆమోదించింది. ‘ది సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీస్ బిల్- 2019’ ను మూజువాణీ ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. ఇదే తీర్మానాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గత యేడాది డిసెంబర్‌లో లోకసభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ దీనిని ఆమోదించి, మార్చి 2న రాజ్యసభకు పంపింది.


రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ (న్యూఢిల్లీ), శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (న్యూఢిల్లీ), రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (తిరుపతి) డీమ్డ్ యూనివర్శిటీలను సెంట్రల్ యూనివర్శిటీలుగా మార్చాలన్న తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మాట్లాడుతూ... దేశంలోని అన్ని భాషలను కేంద్ర ప్రభుత్వం పటిష్టం చేస్తుందని ప్రకటించారు. దేశంలో దాదాపు ఐదు కోట్ల మంది సంస్కృతాన్ని అధ్యయనం చేస్తున్నారని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-03-17T02:12:41+05:30 IST