కులం ప్రస్తావన తీసుకురావద్దన్న హైకోర్టు

ABN , First Publish Date - 2020-04-28T23:26:23+05:30 IST

సబార్డినేట్ కోర్టులు, ప్రత్యేక కోర్టులు, ట్రైటూనల్స్, ఇతర పాలన వ్యవహారాలకు సంబంధించి నిదుతులు లేదా ఇతర వ్యక్తులకు సంబంధించిన కులాన్ని రిజిస్ట్రీల్లో నమోదు చేయడం లాంటివి జరగకూడదు. అధికారులు కూడా ఈ విషయంలో

కులం ప్రస్తావన తీసుకురావద్దన్న హైకోర్టు

జైపూర్: న్యాయపరమైన పాలన పరమైన అంశాలలో కుల ప్రస్తావన తీసుకురావద్దని, సదరు వ్యక్తి కులాన్ని నమోదు చేయరాదని రాజస్తాన్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2018 నాటి ఓ కేసు విచారణ అనంతరం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది.


‘‘సబార్డినేట్ కోర్టులు, ప్రత్యేక కోర్టులు, ట్రైటూనల్స్, ఇతర పాలన వ్యవహారాలకు సంబంధించి నిదుతులు లేదా ఇతర వ్యక్తులకు సంబంధించిన కులాన్ని రిజిస్ట్రీల్లో నమోదు చేయడం లాంటివి జరగకూడదు. అధికారులు కూడా ఈ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేది’’ అని హైకర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


2018కి సంబంధించిన ఓ కేసులో పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు నుంచి బెయిల్ లభించినప్పటికీ మేవ్ అనే కులానికి బదులు జాతవ్ అనే కులం టైప్ కావడం వల్లే తన క్లైంట్‌కు బెయిల్ రాలేదని అన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. పై విధంగా వ్యాఖ్యానించింది.

Updated Date - 2020-04-28T23:26:23+05:30 IST