రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది: అపోలో వైద్యులు

ABN , First Publish Date - 2020-12-25T20:47:32+05:30 IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఆందోళన చెందొద్దని అపోలో వైద్యులు ప్రకటించారు.

రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది: అపోలో వైద్యులు

హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందొద్దని అపోలో వైద్యులు ప్రకటించారు. ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక బృందం మానిటర్ చూస్తోందని.. రజినీకాంత్‌కు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు. నాలుగు రోజులుగా రజినీకాంత్ హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. బీపీ పెరగడంతో చిత్ర యూనిట్ ఆస్పత్రికి షిఫ్ట్ చేసిందని వైద్యులు తెలిపారు. బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు వెల్లడించారు. ప్రముఖులు, అభిమానులు ఆస్పత్రికి రావొద్దని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి చేశారు. 


శుక్రవారం ఉదయం రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు చికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనతో పాటు కుమార్తె ఐశ్వర్య ఆస్పత్రిలోనే ఉన్నారు. కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్‌గా తేలింది. ఇదిలా ఉంటే, రజినీ హీరోగా నటిస్తున్న ‘అన్నాత్తే’ మూవీ నగరంలోని రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు. షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రొడక్షన్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపేశారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

Updated Date - 2020-12-25T20:47:32+05:30 IST