కోవిడ్-19: కాంట్రాక్టు ఉద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త

ABN , First Publish Date - 2020-03-25T01:58:23+05:30 IST

లక్షలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ రైల్వే శాఖ ఇవాళ ఓ శుభవార్త చెప్పింది. ఈ నెల 31 వరకు ప్యాసెంజర్...

కోవిడ్-19: కాంట్రాక్టు ఉద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త

న్యూఢిల్లీ: లక్షలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ రైల్వే శాఖ ఇవాళ ఓ శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ కారణంగా ఈ నెల 31 వరకు ప్యాసెంజర్ సర్వీసులను నిలిపివేసినప్పటికీ... పూర్తి జీతాలు చెల్లించనున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైళ్లు, స్టేషన్లు, ఆఫీసుల్లో సేవలు అందిస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు, ఔట్‌ సోర్స్ సహా  ప్రయివేటు సంస్థలకు చెందిన ఉద్యోగులంతా లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ.. ‘ఆన్‌డ్యూటీ’గా పరిగణించి లాక్‌డౌన్ ముగిసే వరకు పూర్తిస్థాయి జీతం అందించనున్నట్టు రైల్వే శాఖ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా సర్వీసులు నిలిపివేసిన కారణంగా ఈ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టవద్దనీ.. సూచించిన విధంగా జీతాలు చెల్లించాలని జోనల్ రైల్వే కార్యాలయాలకు రైల్వే బోర్డు స్పష్టం చేసింది. 

Updated Date - 2020-03-25T01:58:23+05:30 IST