రైల్వే సేవలు 14 వరకు నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-25T08:00:22+05:30 IST

అన్ని ప్యాసింజర్‌ రైళ్ల సర్వీసుల నిలిపివేత వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని భారతీయ రైల్వే ప్రకటించింది.

రైల్వే సేవలు 14 వరకు నిలిపివేత

న్యూఢిల్లీ, మార్చి 24: అన్ని ప్యాసింజర్‌ రైళ్ల సర్వీసుల నిలిపివేత వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని భారతీయ రైల్వే ప్రకటించింది. జాతీయ స్థాయిలో 21 రోజుల లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నిత్యావసరాలను అందుబాటులో ఉంచాల్సి ఉన్నందున రవాణా రైళ్లు యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-03-25T08:00:22+05:30 IST