రెమ్డిసివిర్ చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రులకు కొత్త మార్గదర్శకాలు జారీ!

ABN , First Publish Date - 2020-08-16T01:57:09+05:30 IST

ప్రభుత్వం రిఫర్ చేసిన కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు రెమ్డిసివిర్‌తో చికిత్స చేయచ్చంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రెమ్డిసివిర్ చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రులకు కొత్త మార్గదర్శకాలు జారీ!

బెంగళూరు: ప్రభుత్వం రిఫర్ చేసిన కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు రెమ్డిసివిర్‌తో చికిత్స చేయచ్చంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు ఈ సౌలభ్యం అందుబాటులో ఉండగా.. తాజాగా ప్రైవేటు ఆస్పత్రులకూ ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే..ఆస్పత్రి యాజమాన్యాలు ముందుగా.. రెమ్డిసివిర్ కోసం సువర్ణ ఆరోగ్య సురక్ష ట్రస్టుకు దరఖాస్తూ చేసుకోవాలని తెలిపింది. ఈ విజ్ఞప్తులను బెంగళూరులో అయితే రీజినల్ కన్సల్టెంట్, ఇతర జిల్లాల్లో అయితే జిల్లా సమన్వయకర్తలు పరిశీలించి తగు అనుముతులు జారీ చేస్తారంటూ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్డిసివిర్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు గట్టి చర్యలు చేపడుతున్న ప్రభుత్వం ఆ దిశగా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. 

Updated Date - 2020-08-16T01:57:09+05:30 IST