రైతులకు మద్దతుగా రాజీనామా చేసిన పంజాబ్ డీఐజీ

ABN , First Publish Date - 2020-12-13T21:55:59+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్ జైఅళ్ల శాఖ డీఐజీ లఖ్మీందర్ సింగ్

రైతులకు మద్దతుగా రాజీనామా చేసిన పంజాబ్ డీఐజీ

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా పంజాబ్ జైళ్ల శాఖ డీఐజీ లఖ్మీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. ‘‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా నిలబడాలని నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని తెలియజేసుకుంటున్నా.’’ అని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-13T21:55:59+05:30 IST