పీఎంఓ ఉప కార్యదర్శిగా పుణె జిల్లా కలెక్టర్
ABN , First Publish Date - 2020-08-04T23:03:56+05:30 IST
పుణె జిల్లా కలెక్టర్ నావల్ కిషోర్ రామ్ను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) డిప్యూటీ సెక్రటరీగా కేంద్ర..
న్యూఢిల్లీ: పుణె జిల్లా కలెక్టర్ నావల్ కిషోర్ రామ్ను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) డిప్యూటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ మంగళవారంనాడు నియమించింది. నియామక ఉత్తర్వులను మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పంపింది.
మహారాష్ట్ర క్యాడర్ 2008 బ్యాచ్కు చెందిన రామ్ సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద నాలుగేళ్ల పాటు పీఎంఓ డిప్యూటీ సెక్రటరీ బాధ్యతల్లో ఉంటాడు. ఆయన ఉద్యోగం చేపట్టినప్పటి నుంచి నాలుగేళ్ల వరకూ, లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ బాధ్యతల్లో ఉంటారు. పీఎంఓ కార్యాలయంలో కొత్త బాధ్యతలు చేపట్టేందుకు రామ్ను రిలీవ్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ కోరింది.