అలా చేయకపోవడం వల్లే ప్రమాదం: ప్రియాంక

ABN , First Publish Date - 2020-05-16T19:52:41+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అవురియా రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు మృతిచెందడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ..

అలా చేయకపోవడం వల్లే ప్రమాదం: ప్రియాంక

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అవురియా రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు మృతిచెందడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర విచార వ్యక్తం చేశారు. ఈ మరణాలకు ప్రభుత్వాల తప్పిదమే కారణమంటూ మండిపడ్డారు.


'అవురియా ఘటన హృదయ విదారకంగా ఉంది. వలస కార్మికుల ఇళ్లకు చేరేందుకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ప్రతి ఒక్కరూ అనుకోవడానికి మరోసారి ఈ ఘటన ఆస్కారం ఇచ్చింది. రాష్ట్రంలోపల అయినా బస్సుల్లో కార్మికులను తమ స్వస్థలాలకు తరలించి ఉండొచ్చు. అలా ఎందుకు చేయలేకపోయారు?' అని ప్రియాంక ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు. ప్రతీదీ దైవాధీనమని ప్రభుత్వం అచేతనంగా ఉండిపోవడం సరికాదని ఆమె విమర్శించారు. శనివారం తెల్లవారుజామున వలస కార్మికులతో ప్రయాణిస్తున్న ట్రక్కు అవురియా జిల్లాలో మరో ట్రక్కును ఢీకొన్న ఘటనలో 24 మంది మృతి చెందారు. 15 నుంచి 20 మంది గాయపడ్డారు. వలస కూలీల్లో ఎక్కువ మంది బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారున్నారు.

Updated Date - 2020-05-16T19:52:41+05:30 IST