ప్రశాంత్ భూషణ్పై కోర్టు ధిక్కార కేసు వద్దు
ABN , First Publish Date - 2020-07-28T07:31:21+05:30 IST
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్పై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన సుప్రీంకోర్టు.. దీనిపై విచారణ జరపనుండడంపై పునరాలోచించాలని 130 మందికి పైగా ప్రముఖులు.....
![ప్రశాంత్ భూషణ్పై కోర్టు ధిక్కార కేసు వద్దు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సుప్రీంకోర్టును కోరిన 130 మంది ప్రముఖులు
న్యూఢిల్లీ, జూలై 27: సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్పై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసిన సుప్రీంకోర్టు.. దీనిపై విచారణ జరపనుండడంపై పునరాలోచించాలని 130 మందికి పైగా ప్రముఖులు కోరారు. న్యాయస్థానానికి ఈ వినతి చేసిన వారిలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎంబీ లోకుర్, ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్, మాజీ ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు.