మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు పాజిటివ్
ABN , First Publish Date - 2020-10-27T06:56:01+05:30 IST
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు కరోనా సోకింది. తన ఆరోగ్యం బాగానే ఉందని,
న్యూఢిల్లీ, అక్టోబరు 26: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు కరోనా సోకింది. తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సూచన మేరకు ముందు జాగ్రత్త చర్యగానే ఆస్పత్రిలో చేరానని ఆయన సోమవారం వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా కరోనా బారినపడ్డారు. కాగా.. దేశంలో గడచిన 24 గంటల్లో 50 వేల కన్నా తక్కువగా కేసులు నమోదయ్యాయి.
జూలై 22 తర్వాత అతి తక్కువగా 45,148 కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా 108 రోజుల్లో అతి తక్కువగా 480 నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 79,09,959కి చేరుకోగా.. ఇప్పటివరకు 1,19,014 మంది వైరస్ బారినపడి మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.