చవక ధరలో పోర్టబుల్‌ వెంటిలేటర్‌

ABN , First Publish Date - 2020-04-05T05:52:29+05:30 IST

కొవిడ్‌-19 బాధితుల కోసం హైదరాబాద్‌లోని ‘నెక్స్‌ట్‌ బైట్‌’ అనే సంస్థకు చెందిన ఇంజనీర్ల బృందం చవక ధరలో లభించే పోర్టబుల్‌ వెంటిలేటర్లను రూపొందించారు. రెగ్యులర్‌ వెంటిలేటర్ల...

చవక ధరలో పోర్టబుల్‌ వెంటిలేటర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4: కొవిడ్‌-19 బాధితుల కోసం హైదరాబాద్‌లోని ‘నెక్స్‌ట్‌ బైట్‌’ అనే సంస్థకు  చెందిన ఇంజనీర్ల బృందం చవక ధరలో లభించే పోర్టబుల్‌ వెంటిలేటర్లను రూపొందించారు. రెగ్యులర్‌ వెంటిలేటర్ల కొరత ఏర్పడిన అత్యవసర సమయంలో మాత్రమే ఈ పోర్ట్టబుల్‌ వెంటిలేటర్‌ ఉపయోగపడుతుంది. ‘అంబో బ్యాగ్‌’ను ఆపరేట్‌ చేయడానికి వీలుగా దీనిలో ఎలకో్ట్రమెకానికల్‌ డివైజ్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కూడా దీనిని ఆపరేట్‌ చేయవచ్చు. ఈ వెంటిలేటర్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి,  తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటీఆర్‌కు నెక్స్‌ట్‌ బైట్‌ సిఇఓ కృష్ణ గంజి ట్యాగ్‌ చేశారు. ఈ పరికరం సాధ్యాసాధ్యాలను పరీక్షించాలని కోరుతూ కేటీఆర్‌ ఐటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌కి రీట్వీట్‌ చేశారు. ఈ వెంటిలేటర్‌ పూర్తి స్థాయిలో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చినట్లయితే రూ.4000కే దొరికే అవకాశం ఉంది.

Updated Date - 2020-04-05T05:52:29+05:30 IST