లాక్డౌన్ ఎఫెక్ట్.. యమునా నదిలో 30శాతం తగ్గిన కాలుష్యం
ABN , First Publish Date - 2020-04-21T18:25:05+05:30 IST
కరోనా వ్యాప్తిని అరికట్టేందకు కేంద్రం మే 3వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందకు కేంద్రం మే 3వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ను విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ.. ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడమే కాకుండా.. పలు పరిశ్రమలు కూడా మూతబడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా వాయు, నీటి కాలుష్య శాతం తగ్గు ముఖం పడుతోంది.
ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలోని యమునా నదిలో 30 శాతం కాలుష్యం తగ్గిందని.. ఢిల్లీ కాలుష్య నివారణ సంస్థ(డీపీసీసీ) వెల్లడించింది. కాలువల నుంచి వచ్చే వ్యర్థాలు 80 శాతం తగ్గాయని డీపీసీసీ పేర్కొంది. దీంతో యమునా నదిలో స్వచ్ఛమైన నీరు పారుతోందని డీపీసీసీ అధికారి ఒకరు వెల్లడించారు. నీటిలో కాలుష్యం తగ్గినప్పటికీ.. అవి తాగేందుకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు. నీటితో పాటు దేశ రాజధానిలో వాయు కాలుష్యం కూడా తగ్గిందని అధికారులు స్పష్టం చేశారు.