ప్రధాని మోదీ క్వారంటైన్ లోకి వెళ్లరా? శివసేన

ABN , First Publish Date - 2020-08-16T19:48:15+05:30 IST

అయోధ్య భూమిపూజ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న

ప్రధాని మోదీ క్వారంటైన్ లోకి వెళ్లరా? శివసేన

ముంబై : అయోధ్య భూమిపూజ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ క్వారంటైన్‌లోకి వెళ్తారా? అని శివసేన సూటిగా ప్రశ్నించింది. ప్రధాని మోదీ క్వారంటైన్ నిబంధనలను పాటించరా? అని సామ్నా వేదికగా ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. 

‘‘ఆగస్టు 5 న జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజలో మహంత నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. ఆయన మాస్కు పెట్టుకోలేదు. ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. మోదీ భక్తితో గోపాల్ దాస్ చేతిని కూడా పట్టుకున్నారు. అందుకే మోదీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి’’ అని రౌత్ పేర్కొన్నారు.

ఇక... కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్‌పై కూడా రౌత్ విరుచుకుపడ్డారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న మేఘవాల్ వ్యాఖ్యలపై రౌత్ మండిపడ్డారు. ‘‘భారత్ భాబీజీ పాపడ్ దగ్గరే ఆగిపోయింది. రష్యా మాత్రం కోవిడ్ -19 కు వ్యాక్సిన్ కనిపెట్టింది. ఆత్మ నిర్భరతను చూపించింది. మనం మాత్రం ఆత్మ నిర్భర భారత్‌పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాం’’ అంటూ కేంద్రంపై రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Updated Date - 2020-08-16T19:48:15+05:30 IST