శివకుమార స్వామీజీకి ప్రధాని మోదీ నివాళి
ABN , First Publish Date - 2020-04-01T21:58:21+05:30 IST
సిద్ధగంగ పీఠాధిపతి, లింగాయతుల ఆరాధ్య దైవం శివకుమార స్వామి 113వ జయంతి సందర్భంగా..
న్యూఢిల్లీ: సిద్ధగంగ పీఠాధిపతి, లింగాయతుల ఆరాధ్య దైవం శివకుమార స్వామీజీ 113వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులు అర్పించారు. ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించిన మోదీ.. సమాజానికి స్వామీజీ అందించిన సేవలను కొనియాడారు. ‘‘శ్రీ శ్రీ శ్రీ శివకుమార స్వామిగారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళి. సమాజానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తి నింపేవిగా ఉంటాయి..’’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.