కేసీఆర్, జగన్కు మోదీ ఫోన్
ABN , First Publish Date - 2020-07-20T01:18:07+05:30 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్లతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు, కట్టడి చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
![కేసీఆర్, జగన్కు మోదీ ఫోన్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020071907434185/07192020194745n41.jpg)
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్లతో ఫోన్లో మాట్లాడారు. కోవిడ్ పరిస్థితులు, కట్టడి చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆయన తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతో కూడా మాట్లాడారు. కరోనా పరిస్థితులపై చర్చించారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్తో ఫోన్ ద్వారా మాట్లాడిన ప్రధాని అక్కడి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.