అందరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నా : ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2020-05-19T00:58:05+05:30 IST
ఆంఫన్ తుఫాను నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ అధికారులతో పాటు జాతీయ విపత్తు నివారణ సంస్థ అధికారులతో సోమవారం సమీక్ష
![అందరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నా : ప్రధాని మోదీ](https://media.andhrajyothy.com/appimg/galleries/202005180127176/05182020192801n76.jpg)
న్యూఢిల్లీ : ఆంఫన్ తుఫాను నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ అధికారులతో పాటు జాతీయ విపత్తు నివారణ సంస్థ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై మోదీ ఓ ట్వీట్ చేశారు. ‘‘ఆంఫన్ తుఫానుకు ఎలా సంసిద్ధతపై చర్చించాం. ప్రతిస్పందనలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియల గురించి చర్చించాం. అందరూ క్షేమంగా, సుఖంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా. ఏయే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్షా, ప్రధాని ముఖ్య సలహాదారు సిన్హా, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులు హాజరయ్యారు.