ప్లాస్మా థెరపీ క్షేమం కాదు: కేంద్రం
ABN , First Publish Date - 2020-04-28T23:21:37+05:30 IST
ప్లాస్మా థెరపీ ద్వారా కరోనాను తగ్గించొచ్చంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ప్లాస్మా థెరపీ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా

న్యూఢిల్లీ: ప్లాస్మా థెరపీ ద్వారా కరోనాను తగ్గించొచ్చంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ప్లాస్మా థెరపీ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా తగ్గుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కరోనా బాధితులకు ప్లాస్మా థెరపీ చేయడం చట్టవ్యతిరేకం అని పేర్కొన్నారు. అంతేకాకుండా రోగి ప్రాణాలకే ముప్పువాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ఐసీఎంఆర్ అప్రూవ్ చేసే వరకు ప్లాస్మాథెరపీ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు.