కోయంబత్తూరులో ఆలయాలపై మాంసం ముక్కలు
ABN , First Publish Date - 2020-05-30T08:47:50+05:30 IST
హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు మాంసపు ముక్కలు విసరడంతో కోయంబత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సులివాన్ వీధిలో
![కోయంబత్తూరులో ఆలయాలపై మాంసం ముక్కలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చెన్నై, మే 29 (ఆంధ్రజ్యోతి): హిందూ దేవాలయాలపై గుర్తు తెలియని దుండగులు మాంసపు ముక్కలు విసరడంతో కోయంబత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక సులివాన్ వీధిలో వేణుగోపాల కృష్ణన్ స్వామి, రాఘవేంద్ర ఆలయాలున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా వాటిని మూసివేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం మోటార్ సైకిల్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ ప్రవేశద్వారం వద్ద మాంసం ముక్కలు విసిరి పారిపోయా రు. వారు విసిరిన దాన్ని పంది మాంసంగా భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు భగ్గుమన్నారు. ఆలయాల వద్ద ధర్నా చేపట్టారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై బీజేపీ ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దుండగులను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.