‘ప్లాస్మా ఇంజెక్షన్’తో వైర్సకు అడ్డుకట్ట
ABN , First Publish Date - 2020-07-12T08:04:25+05:30 IST
కొవిడ్ మహమ్మారికి ‘ప్లాస్మా ఇంజెక్షన్’తో అడ్డుకట్ట వేయొచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల నుంచి యాంటీబాడీలు సమృద్ధిగా ఉండే ప్లాస్మాను సేకరించి దాన్ని టీకా తరహాలో ప్రజల చేతికి ఇంజెక్షన్లా ఇస్తే బాగా పనిచేస్తోందని...
- అమెరికా శాస్త్రవేత్తల ప్రతిపాదన
- పట్టించుకోని అధికారులు, ఫార్మా సంస్థలు
వాషింగ్టన్, జూలై 11: కొవిడ్ మహమ్మారికి ‘ప్లాస్మా ఇంజెక్షన్’తో అడ్డుకట్ట వేయొచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ బారిన పడి కోలుకున్న రోగుల నుంచి యాంటీబాడీలు సమృద్ధిగా ఉండే ప్లాస్మాను సేకరించి దాన్ని టీకా తరహాలో ప్రజల చేతికి ఇంజెక్షన్లా ఇస్తే బాగా పనిచేస్తోందని అంటున్నారు. కొన్ని నెలల పాటు వైర్సను అడ్డుకునే శక్తినిస్తుందని చెబుతున్నారు. ఈ విధానం ఎంతగానో ఉపయుక్తమని హెపటైటిస్ ఏ వంటి వ్యాధుల విషయంలో రుజువు కూడా అయిందని గుర్తుచేస్తున్నారు. ప్లాస్మా ఇంజెక్షన్లు లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడతాయని అంటున్నారు. అలాగే సాధారణ ప్రజలకూ ఇవ్వొచ్చని ఇద్దరు పరిశోధకులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు పలువురు శాస్త్రవేత్తలు మద్దతిస్తున్నారు. కానీ, ఫెడరల్ అధికారులు, ఫార్మా సంస్థలు రెండు సార్లు తిరస్కరించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.